యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక సీఎం కేసీఆర్ కదన రంగలోకి దిగనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇటీవల టూర్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ నెల 16న భువనగిరికి రానున్నారు. మొదటగా జనగాం జిల్లాకు వెల్లి అకడి నుంచి భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సమాయత్తమవుతున్నారు.
స్వచ్ఛందంగా తరలిరానున్న జనం…
సీఎం కేసీఆర్ సభ అంటేనే జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఎన్ని పనులున్నా.. ఎంత దూరమైనా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. కేసీఆర్ ప్రసంగిస్తుంటే చెవులు నికపొడుచుకుని వింటారు. అలాంటి కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛందంగా తరలిరావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నియోజకవర్గం నుంచి 50వేల మందికి పైగా తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనం ఇబ్బందులు పడకుండా పారింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని జగదేవపూర్ రోడ్డు, రాయగిరి, భువనగిరి కోట కిందతో పాటు పలు చోట్ల పారింగ్ పాయింట్లు పెట్టనున్నారు.
ఇన్చార్జిల నియామకం..
ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గ్రామానికో ఇన్చార్జిని నియమించింది. ఆయా ఇన్చార్జిలు గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మండలాల వారీగా ప్రతినిధులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
జనంలో పూర్తిగా బీఆర్ఎస్ మూడ్
ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమంలో ప్రతిపక్షాలకు అందనంత దూరంలోకి బీఆర్ఎస్ దాటిపోయింది. ఏ సర్వే చూసినా గులాబీ పార్టీదే విజయమని తేల్చి పారేస్తున్నాయి. ఏ ఊరిలోకి వెళ్లినా.. ఎవరిని కదిలించినా.. గెలుపు బీఆర్ఎస్దే అనే మాట వినిపిస్తున్నది. అది కూడా భారీ మెజార్టీ అని చెబుతున్నారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పైళ్లశేఖర్రెడ్డి
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా నిత్యం జరిగే పనులను పరిశీలిస్తున్నారు. శనివారం సైతం కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఒకవేళ వర్షం వస్తే సభికులకు ఇబ్బంది కలుగకుండా రెయిన్ ఫ్రూఫ్ టెంట్లను సైతం సిద్ధంగా ఉంచారు.
మా విజయాన్ని ఎవరూ ఆపలేరు
ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. సభ ఎప్పుడు జరుగుతుందా.. సీఎం కేసీఆర్ ప్రసంగం ఎప్పడు విందామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మేం ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉన్నాం. భారీ మెజార్టీతో గెలువబోతున్నాం. మా విజయాన్ని ఎవరూ ఆపలేరు.
– పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి