అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లేదా మరో స్థలంలో నిర్వహించేలా ఆ పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నాయి. సీఎం కేసీఆర్ సభ, ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నిండనున్నది. అదే రోజు ముఖ్యమంత్రి భువనగిరితోపాటు జనగామ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.