రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ధోరణులుబాబాసాహెబ్కు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నివాళి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతినల్లగొండలో నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా
సమాజంలో ప్రతి వ్యక్తీ సమాన స్థితిలో ఉండాలనే ఆలోచనతో ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు.
బాబాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్నదని తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం బైపాస్లోని ఆయన విగ్రహానికి జడ్పీ చైర్మన్ బండ, ఎమ్మెల్యే కంచర్లతో కసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో పెడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగానూ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు నివాళుర్పించారు.
నల్లగొండ, డిసెంబర్ 6 : ప్రతి వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా సమాన స్థాయిలో ఉండాలనే ఆలోచనతో ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అపర మేథావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డితో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం సాధించడం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అయితే కేంద్రంలో మాత్రం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైన పాలన కొనసాగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నందు వల్ల ప్రజలు ఇబ్బందు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాసి ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కటికం సత్తయ్యగౌడ్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేగట్టె మల్లిఖార్జున్రెడ్డి, నాయకులు సుంకరి మల్లేశ్గౌడ్, మారగోని గణేశ్, మైనం శ్రీను, బొజ్జ దేవయ్య, కత్తుల సహదేవ్, బొజ్జ మహేశ్, వెంకన్న, ఊట్కూరి వెంకట్రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, మాచర్ల జగ్జీవన్ పాల్గొన్నారు.