దేవరకొండ, నవంబర్7: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో 50 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి నోచుకోకపోగా నేడు ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. రైతులకు రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు విడుతలుగా రూ.10వేలు అందించిన ఘనత కేసీఆర్దే అని ఆయన గుర్తుచేశారు. రైతు బీమాక్రింద రైతులు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు 10రోజుల్లో బాధిత కుటుంబ సభ్యులకు అందుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏస్ రాష్ట్రనాయ కులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ రహత్అలీ, బిఆర్ఏస్ నాయకులు అజీమ్, మహ్మద్రైస్, పల్లేపు అశోక్, వేముల రాజు, ఎర్ర కష్ణజాంబవ్, అభిషేక్, బొడ్డుపల్లి కృష్ణ జానిబాబ, జాఫర్ ఉన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే గెలుపునకు సోపానాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకే బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు సోపానాలు అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని నసర్లపల్లి గ్రామం నుంచి 100మంది, తీదేడు గ్రామం నుంచి 50మంది యువకులు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతావత్ బిల్యానాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని తెలిలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరుతున్నారని పేర్కొన్నారు. మళ్లి అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంపు, ’సౌభాగ్యలక్ష్మి’ కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేల చొప్పున భృతి, ‘అన్నపూర్ణ’ ద్వారా తెల్ల రేషన్కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్య పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆశీర్వదించి.. మరో సారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు ఉజ్జిని నరేందర్రావు, కిష్టారెడ్డి, విద్యాసాగర్రావు, శ్రీనివాస్రెడ్డి, రవి, వెంకటయ్య, శేఖర్, వెంకటయ్య, శ్రీను, రాఘవేందర్ ఉన్నారు.
కంకణాల సమక్షంలో చేరికలు
మాల్: చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తండాకు చెందిన బీజేపీ నాయకుడు దేవేందర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిం చారు. అనంతరం కంకణాల వెంకట్రెడ్డి మాట్లా డుతూ ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ గెలుపు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అండేకారు వెంకటేష్, ముద్దం జోగయ్య, తరణ్, దేవా, నరేష్, శ్రవణ్, రమేష్, సాయి, ప్రసాద్, గణేష్, శ్రీకాంత్ ఉన్నారు.
ప్రతి తండాలో బీటీ రోడ్లు
చందంపేట: మండలంలోని ప్రతి గిరిజన తం డాకు బీటీ రోడ్లు వేశామని, తండాల అభివృద్ధికి కృషి చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం చందంపేట మండలం లోని యాపలపాయతండా, రేకులగడ్డ, బుడ్డోని తండా, దాసర్లపల్లి, వెంకటినాయక్తండా, నల్లచెలమూల, చిత్రియాల, పెద్దమూల, కాట్రావత్తండా, గాగిళ్లాపురం, హంక్యతండా గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి, కేతావత్ బీల్యానాయక్, నేనావత్ కిషన్నాయక్తో కలిసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప.. గడపకూ చేరాయని తెలిపారు. మరోమారు తనకు అవకాశం కల్పిస్తే ప్రజా సేవ చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండే తనకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ మరోమారు రవీంద్రకుమార్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి మంత్రి కేటీఆర్ సమక్షంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు నేనావత్ కిషన్నాయక్, రమావత్ జగన్లాల్నాయక్ బీఆర్ఎస్లో చేరడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ బీల్యానాయక్, వడ్త్య రమేశ్నాయక్, నేనావత్ కిషన్నాయక్, రమావత్ జగన్లాల్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ము త్యాల సర్వయ్య, మాజి ఎంపీపీ గోవిందుయాదవ్, రైతు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, స ర్పంచులు సుశీల శంకర్నాయక్, మల్లారెడ్డి, రాజవర్ధన్రెడ్డి, రాములుగౌడ్, సత్యనారాయణ, బుజ్జినాయక్, నర్సయ్య, రామరాజు, వెంకటయ్య, పాపయ్య, శంకర్, కొండల్రెడ్డి, కుమార్, ఎర్ర కృష్ణ, అభిషేక్నాయక్ పాల్గొన్నారు.
చందంపేట: మండలంలోని చిత్రియాల, కొర్రోనితండా గ్రామాల నుంచి నేనావత్ కిషన్నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, రమేశ్నాయక్, బిల్యానాయక్, జగన్లాల్, ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్గౌడ్, గోవిందుయాదవ్, రాములుగౌ డ్, శ్రీరాములు, కొండల్, పాపయ్య, శంకర్, శ్రీధర్, మున్నయ్యయాదవ్, అ నంతగిరి, వెంకటయ్య, రవి ఉన్నారు.