నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుల, మతాలు పార్టీలకు అతితంగా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్టంలో కూడా లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.