పేదల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి సాయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం ఎర్కారం, చివ్వెంల మండలం మున్యానాయక్తండాలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ చేతల ప్రభుత్వమని, పార్టీలకతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత తమదేనన్నారు. సమైక్య పాలనలో గ్రామానికి లక్ష రూపాయల నిధులు కూడా రాని దారుణమైన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం కోట్ల రూపాయలను రాష్ట్ర సర్కారు మంజూరు చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంపదను పెంచి పేదలకు పంచడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటు ద్వారా ఏమి వచ్చిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
– సూర్యాపేట రూరల్/ చివ్వెంల, సెప్టెంబర్ 10
చివ్వెంల/సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 10 : పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా చివ్వెంల మండలంలోని మూన్యానాయక్ తండాలో లబ్ధిదారులు బానోతు లింగి, నాగు ఇంటి నిర్మాణానికి, సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామానికి చెందిన చింత రేవతి ఇంటి నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇండ్లు లేని వారు ఉండకూడదనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక గృహలక్ష్మి పథకమని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతమైన ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండా అని తెలిపారు. నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించే మనసున్న మహరాజు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరు వేసిన ఓటుతో ఏం వచ్చిందో ఆలోచించాలని కోరారు. సొంత జాగ ఉన్న అర్హులందరికీ రూ.3లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. మన జీవితాల్లో వెలుగులు నింపే సీఎం కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి .వెంకటేశ్వర్లు, ఎంపీపీ ధరావత్ కుమారీబాబునాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, సర్పంచ్ బానోతు బికారు, ఎంపీటీసీ ధరావత్ సుశీలాసాగర్, సత్యం, లచ్చిరాం నాయక్ పాల్గొన్నారు.