నీలగిరి, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వారికి ఆర్థికంగా చేయూతనందిస్తు న్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. స్త్రీ,శిశు, దివ్యాంగులు, వయోవృద్ధ్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని శనివారం ఏచూరి గార్డెన్స్ నిర్వ హించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేందుకు పింఛన్ను రూ. 3,016కు పెంచారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులోనూ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటుతోపాటు వారి సమస్యల పరిష్కారానికి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. అనంతరం 100 మందికి ట్రై సైకిల్స్, 100 మందికి శ్రవణ యంత్రాలు, 50 మందికి సంక కర్రలు అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి ఏచూరి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎల్ఐసీ సెక్రటరీ దీప్తి, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, పవర్గ్రీడ్ జనరల్ మేనేజర్ హరినారాయన్, నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల, హరిత, సిబ్బంది గణేశ్, నాగిరెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు. కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, కందుల లక్ష్మయ్య, రావుల శ్రీనివాస్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నకిరేకల్ భవిత కేంద్రం ఆవ రణలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ జిల్లా చైర్మన్ రేగట్టే మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఉమారాణీకృష్ణమూర్తి, కమిషనర్ బాలా జీ, జడ్పీటీసీ ధనలక్ష్మీ నగేశ్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, మండలాధ్యక్షుడు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి కేశవరాజు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ రూరల్ : దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనందిస్త్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా పట్టణంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పిల్లలను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. 18 ఏండ్ల లోపు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రభుత్వం గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నదన్నారు. చిన్నారులకు భవిత కేంద్రంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. అనంతరం ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డితో కలిసి దివ్యాంగులకు ప్రత్యేక పరికరాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి వీరయ్య, ఎంఈఓ బాలాజీనాయక్, మార్కెట్ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సైదయ్యయాదవ్, నాయకుడు ఏడుకొండలు, ఐఈఆర్పీలు బ్రహ్మచారి, జ్యోతి పాల్గొన్నారు.
హాలియా : దివ్యాంగుల్లో దైవాన్ని చూడాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అనుముల మండల ఎంపీపీ సుమతీపురుషోత్తం అన్నారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండలంలోని నాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం దివ్యాంగులను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల నాయకుడు సైదులురావు గౌతమ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంబాబుయాదవ్, గ్రామ సర్పంచ్ చంద్రకళాకిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నీలగిరి : దివ్యాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడాన్ని హర్శిస్తూ నల్లగొండలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రాష్ట్రంలో ఐసీడీఎస్లో దివ్యాంగుల శాఖను విలీనం చేశారన్నారు. దాంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించి తిరిగి వేరు చేయాలని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.