కోదాడ, మార్చి 29 : ఉగాది పర్వదినం నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభా ఏర్పాట్లపై శనివారం కోదాడలోని నివాసంలో కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజూర్నగర్ నుండి రాష్ట్ర ప్రజలకి సన్నబియ్యం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గడిచిన 15 నెలల్లో కోదాడ నియోజకవర్గంలో రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, యంగ్ ఇండియా పాఠశాలలు లాంటివి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల గురించి అలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తుందన్నారు. కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికీ 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని, బీపీఎల్ కుటుంబ సభ్యుల కోసం ఆకుపచ్చ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, పీసీసీ డెలిగేట్ మెంబర్ చింతల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.