మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్క ర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డు హనుమాన్పేట కాలనీలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి రూ.20లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామా లు, పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందని తెలిపారు.
అనంతరం అశోక్నగర్ వార్డులో గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్టు, లఘు చిత్ర దర్వకుడు ఎస్ఏ కలీం మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ చిలకూరి రమాదేవి, నాయకులు చీదళ్ల వెంకటేశ్వర్లు, సుబ్బారావు ఉన్నారు.