రామన్నపేట, ఫిబ్రవరి 2 : పద్మవిభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4న హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో సత్కరించనున్నది. అందులో భాగంగా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ సాహితీవేత్త, కవి కూరెళ్ల విఠలాచార్యను సత్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆయనను ఫోన్లో ఆహ్వానించినట్లు కూరెళ్ల గ్రంథాలయ పాలకుడు తాటిపాముల స్వామి తెలిపారు.