ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు పంటల సాగు నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. రైతన్నల మేలు కోరి మే నెలాఖరుకు మొదటి పంట, నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. వానకాలం వడ్ల కొనుగోళ్లు అక్టోబర్ నెలాఖరుకు, యాసంగివి మార్చి చివరి నాటికి పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ దేశంలో తుఫాన్కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. కల్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. ధాన్యం సేకరణలో అధికారుల కృషిని అభినందించారు. ముందస్తు పంటల సాగుకు సంబంధించి జడ్పీ చైర్మన్ బండ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిరుపేద ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు.
– నల్లగొండ, మే 27
నల్లగొండ, మే 27 : ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునేందుకు పంటల సాగును ముందుకు జరుపాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒకరూ భాగస్వామ్యం కావాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. జిల్లా పరిషత్లో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మే మాసాంతానికి మొదటి, నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తి చేయాలన్నారు. మార్చి చివరికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అందుకు అనుగుణంగా జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రవంగా తీర్మానించింది.
అనంతరం సభలో పలువురు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడారు. స్పందించిన మంత్రి జగదీశ్రెడ్డి తుఫాన్కు తడిసిన ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో అధికారులు అభినందనీయులని ప్రశంసించారు. విధానాలను అమలుపర్చే బాధ్యత శాసనకర్తలకు పరిమితమని అమలుపర్చే బాధ్యత కచ్చితంగా అధికారులపై ఉంటుందని తెలిపారు. అకడకడ చిన్నచిన్న పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు చేయాలని, రాద్ధాంతం చేయడంతో ఒనగూరేదేమీ లేదన్నారు. యావత్ దేశంలోనే కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా పేరొందారన్నారు.
మీడియా ట్రాప్లో పడొద్దు
ప్రతి మీడియా హౌస్కూ ఓ ఎజెండా ఉందన్నారు. జరుగుతున్న దాన్ని జరగలేదని చెప్పేందుకు ఆ మీడియా హౌస్లు పోటీ పడుతున్నాయన్నారు. అభివృద్ధి ఇష్టం లేని పత్రికలు ఈ తరహా ప్రచారానికి పూనుకుంటున్నాయని మండిపడ్డారు. ఇన్నేండ్ల నుంచి రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఎవరి ఎజెండాలను ఉటంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి ట్రాప్లో ఏ ఒకరూ పడొద్దని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ తరహా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రజాప్రతినిధిగా అకడికకడే పరిషరించుకోవాలని లేనిచో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. మీడియా హౌస్ల ప్రచారానికి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా శ్మశానవాటికల్లో విద్యుత్ సౌకర్యం, బోరు మోటార్ ఏర్పాటు చేయాలని, పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలు పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలియజేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, రవీందర్నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల వద్దకొస్తే అక్కడికక్కడే ఫోన్లో అదికారులతో మాట్లాడి ప్రాపర్ ఎవిడెన్స్తో పరిష్కరించాలి, లేదంటే బాధ్యులపై ఫిర్యాదు చేయాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఏ ఆధారాలు లేకుండా సభలో కావాలని మాట్లాడి తప్పుదోవ పట్టించొద్దు అని సభ్యులకు సూచించారు. సభలో పార్టీల తారతమ్యం ఎప్పుడూ ఉండదని ప్రతి సభ్యుడు స్వేచ్ఛగా తమ సమస్యలు తెలియచేసి పరిష్కారం పొందవచ్చని అన్నారు. అదికారులు సైతం ప్రజాప్రతినిధుల సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు.