యాదాద్రి, డిసెంబర్ 26 : జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను అందజేస్తూ వారికి అండగా ఉంటున్నది ముఖ్యమంత్రి కేసీఆర్నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(143) 3వ ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రసాధనోద్యమంలో జర్నలిస్టుల పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఏం కావాలని రాష్ర్టాన్ని ఏర్పాటు చేశామో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అక్షరాల అమలవుతుందని వివరించారు.
విద్యుత్, సాగు జలాలు, వ్యవసాయరంగంలో దేశానికి రాష్ట్రంలో రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు. అభివృద్ధిలో పోటీ పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే కేటాయించినట్లు వెల్లడించారు. స్వరాష్ట్రంలో జర్నలిస్టులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే(143)లో 10 వేలకుపైగా జర్నలిస్టులు సభ్యత్వం కలిగి ఉండడం గొప్ప విషయమని అన్నారు. పాత్రికేయులు రాసిన రాతలతోనే ప్రజల్లో తమకు ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని తెలిపారు.
అనంతరం టీయూడబ్ల్యూజే(143) నల్లగొ ండ జిల్లా అధ్యక్షుడిగా గుండగోని జయశంకర్గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా వజ్జె వీరయ్యను ఎన్నుకున్నారు. యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల కృష్ణారెడ్డి, సంఘం రాష్ట్ర నాయకులు మారుతీసాగర్, ఇస్మాయిల్, భాస్కర్, రమణ, గుండు ముత్తయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే త్వరలో ఐజేయూలో కి..
రాష్ట్రంలో అనివార్యంగా ఏర్పడిన జర్నలిస్ట్ సంఘాలే తప్ప, ఒక అస్థిత్వం, తెలంగాణ కోసం పుట్టిన ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే ( 143) అని తెలంగాణ మీడియ అకాడమీ ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 10 వేల మందిని ఏకం చేసిన టీయూడబ్ల్యూజే-143ను త్వరలో 17 రాష్ర్టాల్లో ఉన్న ఐజేయూలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. భువనగిరికి చరిత్ర ఉందన్నారు. జైనీ మల్లయ్యగుప్తా చేసిన ఉద్యమ ప్రేరణతో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలు పురుడు పోసుకున్నట్లు వివరించారు. ఈతరం పాత్రికేయులు చరిత్ర తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో సక్సెస్ పుల్ సీఎంగా కేసీఆర్ నిలిచారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల అక్రిడిటేషన్ కార్డులు, 3 వేల మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష అందజేశామని అన్నారు. డెస్క్లో పనిచేసే జర్నలిస్టులను గుర్తించి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్కు చెందిన జర్నలిస్ట్ సునీల్కుమార్, భువనగిరికి చెందిన జర్నలిస్ట్ రాములు మృతి చెందారని, వారిని స్మరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.