రామన్నపేట, సెప్టెంబర్ 27: రైతుల శ్రేయస్సుకోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోరూ. 1.28లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ.10 లక్షలతో నిర్మించనున్న స్వర్ణకారుల సంఘం భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.సబ్బండ వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
నాబార్డు ద్వారా గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. సహకార సంఘం రూ. 8 కోట్ల లాభాలను గడిచడం సంతోషమన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కారుచీకట్లు కమ్ము కుంటాయని ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలన్నారు. శుక్రవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖాన, చెన్నకేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలకాలన్నారు.
సింగిల్విండో చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్విండో డైరెక్టర్లు కన్నెకంటి వెంకటేశ్వరచారి, కొండల్రెడ్డి, పాశం రాంరెడ్డి, నాగు ఆంజ నేయులు, వెంకట్రెడ్డి,కల్లూరి ధనమ్మ, అంజమ్మ, అకమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క మాధవరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆవుల నరేందర్, నాయకులు పున్న జగన్మోహన్, అంతటి రమేశ్, పోశబోయిన మల్లేశం, పోతరాజుసాయి, స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు కన్నెకంటి వెంకటేశ్వరచారి పాల్గొన్నారు.
చెర్వుఅన్నారం, గార్లబాయిగూడెంలో ..
కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో రూ.20 లక్షలతో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్, గార్లబాయిగూడెంలో 10లక్షలతో సీసీ రోడ్డు, రూ.30లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు రైతులకు రెండు పంటలకు సాగునీరందించేదుకు అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.
100 కోట్లతో లిప్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అట్టి పనులకు శుక్రవారం మంత్రులు హరీశ్రా వు, జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు జెల్లా ముత్తి లింగయ్య, సూదిరెడ్డి నరేందర్రెడ్డి, జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ఎంపీఓ మహ్మద్ అర్థర్ పర్వేజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఏపీఎం చౌగోని వినోద, సర్పంచులు నంద్యాల చైతన్యానర్సిరెడ్డి, బోడ సరితాయాదగిరి, వడ్డె సైదిరెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ గుండగోని రాములు, ఉప సర్పంచులు పొడిచేటి సునీతా రాంబాబు, ఆవుల సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పీఏసీఎస్ డైరెక్టర్ దాసరి శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, నాయకులు ఎడ్ల చిన రాములు, వంగూరి సైదులు పాల్గొన్నారు.
ఏపీ లింగోటంలో సబ్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
నార్కట్పల్లి: మండలంలోని ఏపీలింగోటం గ్రామంలో ఆరోగ్య మిషన్ పథకం రూ. 20 లక్షలతో సబ్ హెల్త్ సెంటర్కు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచ్ నూకల శంకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నకిరేకల్లో బీటీరోడ్డు పనులకు..
నకిరేకల్: మండలంలోని నోముల గ్రామంలో రూ.64 లక్షలతో నిర్మించనున్న నోముల టు గుడివాడ, చందుపట్ల టు బండపాలెం బీటీరోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాలలో జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్ గౌడ్, బొప్పని స్వర్ణలత సురేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
చిట్యాల: చిట్యాల పట్టణంలోని 10వ వార్డుకు చెందిన తిరుపాల గణేశ్కు సీఎం సహాయ నిధి నుంచి రూ.46వేలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కును ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం చిట్యాలలో బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఎంపీపీ కొలను సునీత, మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, తాసీల్దార్ దశరథ, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్ సిలువేరు మౌనిక, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, దాసరి నర్సింహ పాల్గొన్నారు.
నేడు కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన
చిట్యాల :మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న కుల సంఘాల భవనాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్లు తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీహాల్, యాదవ కురుమ భవనం, , ఆర్ఎంపీల భవనం, గౌడ కుల సంఘం భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.