నల్గొండ : కృష్ణా నదీ జలాల(( Krishna river water) ) పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో నల్గొండ ను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కోదాడ బీఆర్ఎస్ (Kodada BRS) ఇన్చార్జి , మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ రవీంద్రరావు (MLC Ravindra Rao) శనివారం కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో చలో నల్గొండకు సంబంధించిన వాల్పోస్టర్(Wall Poster) ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలో నల్లగొండలో చలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు కోదాడ నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. మన నీళ్లు, మన హక్కుల కోసం కేసీఆర్ నాయకత్వంలో కలిసి పోరాడడానికి కదలి రావాలని కోరారు.