నీలగిరి/సూర్యాపేట టౌన్, జనవరి 13 : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలంతా ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీషశ్రెడ్డి తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టాలు భోగి మంటల్లో కాలిపోవాలని, రైతులకు శుభం కలుగాలని, పండుగ తెచ్చే సంబురాలతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.