యాద్రాది, డిసెంబర్ 21: యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు. 22సెంట్రల్ ఎల్ఈడీ లైట్లు వెలగడంతో ప్రధాన రోడ్డు ప్రాంతాలు ఒక్కసారిగా వెలుగులు విరజిమ్మాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సెంట్రల్ లైటింగ్ వెలుగులతో యాదగిరిగుట్ట పట్టణం అద్భుతంగా మారిందన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులను ఆకట్టుకునేలా పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి ఇంటికీ డిజిటల్ నంబర్ ప్లేట్, ప్రతి గల్లీకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ చొరవతో యాదగిరిగుట్ట పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎల్ఈడీ లైట్లు వెలిగేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, వైస్ చైర్మన్ కాటం రాజు, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మున్సిపల్ కౌన్సిలర్ గుండ్లపల్లి వాణీభరత్గౌడ్, తాళ్లపల్లి నాగరాజు, మక్కెర్ల మల్లేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, నాయకులు సుడుగు శ్రీనివాస్రెడ్డి, గుండ్లపల్లి భరత్గౌడ్, ముక్కెర్ల సతీశ్, అంకం నర్సింహ, పాపట్ల నరహరి పాల్గొన్నారు.