CEIR | సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 26 : పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఈ పోర్టల్ అవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. చాలా మంది వినియోగదారులు మొబైల్స్ వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే. నమోదు చేసుకున్న వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రూ.4.50 లక్షల విలువైన 23 మొబైల్స్ను రికవరీ చేసినట్లు తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్స్ పోయినా, చోరీకి గురైనా ఐఎంఈఐ నంబర్, బిల్, మీసేవా రశీదు, పోలీస్స్టేషన్, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్కోడ్ తదితర వివరాలపై ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా పోయిన సెల్ఫోన్ల పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఆధారాలు దొంగిలించి నష్టాన్ని కలుగజేస్తాయన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీస్స్టేషన్ల వారీగా పెన్పహాడ్ 7,సూర్యాపేట టౌన్ 3, కోదాడ రూరల్ 3, సూర్యాపేట రూరల్ 2, పాలకవీడు 2, సూర్యాపేట టౌన్ 12, కోదాడ టౌన్ 1, తుంగతుర్తి 1, నూతనకల్ 1, మోతె 1 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మొబైల్స్ రికవరీ చేసిన పెన్పహాడ్ ఎస్ఐ, సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు. డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వరరెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆబీ ఇన్స్పెక్టర్ నర్సింహ, సీఐ రాజేశ్, ఆంజనేయులు, రామలింగారెడ్డి, రాఘవులు, నాగార్జున పాల్గొన్నారు.