దేవరకొండరూరల్, ఫిబ్రవరి 29 : నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మండలంలోని కట్టకొమ్ముతండా, గుడ్డి లచ్చాతండా, ముదిగొండ, జర్పులతండా, పాత్లావత్తండాల్లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ముదిగొండలో రూ. 6 లక్షలతో పైప్లైన్, జర్పులతండాలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు.
అనంతరం పడ్మట్పల్లి జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన సైన్స్ఫెయిర్లో పాల్గొన్నారు. వివిధ సైన్స్ మోడల్ చూసిన ఎమ్మెల్యే ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. పాఠశాల ఆవరణలో మనం-మన బడి ఫౌండేషన్ సభ్యులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహ, ఎంపీడీఓ సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, పీఆర్ఏఈ శంకర్, కొర్రరాంసింగ్, మాజీ సర్పంచులు,శివయ్య, నర్యా, గోవిందు పాల్గొన్నారు.
చందంపేట, మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ చిత్రియాల పీఏసీఎస్ చైర్మన్ జాల నర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జర్పుల బద్యానాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, గన్నెర్లపల్లి,మానావత్తండాల్లో సీసీ రోడ్డు, నూతన గ్రామంచాయతీ, అంగన్వాడీభవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.