అవగాహనలేమితో కొయ్యలు, గడ్డి పొలంలోనే దహనం
భూమిలోని అవశేషాలు, ఖనిజ లవణాలు
నశిస్తాయంటున్న వ్యవసాయ అధికారులు
నూతనకల్, మే 17: వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు అలాగే పొలంలో వదిలేస్తున్నారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో పాటు, గడ్డిని దహనం చేస్తున్నారు. అన్నదాతలు అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కలియ దున్నితే ఎన్నో ప్రయోజనాలు
నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు…