నల్లగొండ సిటీ, నవంబర్ 15: 20 ఏండ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా కమీషన్ల కోసమే పని చేసిన కమీషన్ల రెడ్డికి ఓటేస్తే ఈ నల్లగొండ మరో ఐదేండ్లు గోస పడతది అని నల్లగొండ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యెడవల్లి, బుడమర్లపల్లి, బోయినపల్లి, బచ్చన్నగూడెం, మార్తినేని గూడెం, లచ్చుగూడెం, తుర్కపల్లి, హైదలాపురం, ఎం.గౌరారాం, అమ్మగూడెం, తిమ్మాజీగూడెం, కనగల్ గ్రామాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏండ్లు నల్లగొండ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే ఎందుకు అభివృద్ధ్ది చేయలేదని ప్రశ్ని స్తూ ఇప్పుడు ఎలా చేస్తావని అన్నారు. నల్లగొండలో చేసిన ఒకటి, రెండు పనులు ప్రజలకు ఉపయోగ పడేవి కాకుండా ఆయన కమీషన్ల కోసమే చేశాడని అలాంటి కమీషన్ల రెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా గుణపాఠం చెప్తేనే మరోసారి నల్లగొండకు రాకుండా పోతాడన్నారు.
రాష్ట్రంలో 40 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసునని మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీ పాలన ద్వారా రాష్ట్రం అంధకారంలోకి పోతుందన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోఎకరం కూడా ఎండిపోలేదన్నారు. 24 గంటల కరెంటుతో రైతులు సోమరిపోతులు అవుతున్నారని మూడు గంటల కరెంటు సరిపోతుంది అని చెప్పిన కాం గ్రెస్ మనకు అవసరమా అని అన్నారు.
రైతులను రాజు చేయాలని, వారి సం క్షేమ కోసమే అనేక పథకాలు అమలు చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలా వద్దా అని రైతులు అలోచన చేయాలన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని, ఇలా వచ్చి అలా వెళ్లే కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేసి అగం కావద్దన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే రైతులకు మళ్లి చీకటి రోజులే వస్తాయన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది పదంలో నడిపిస్తానని అన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న నా శక్తి మేరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
కాంగ్రెస్ వైఖరితో ఉద్యమంలో ఎంతోమంది యువకులు అత్మ బలిదానాలు చేసుకున్నారని తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని కోట్లాడి సాధించుకున్నామని అన్నారు. బీజేపీ పుణ్యమా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగియన్నారు. సిలిండర్ను రూ.400లకే ఇచ్చేందుకు మ్యానిఫెస్టో తయారు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు మూటలతో ఓట్లు కోని గెలువాలని చూస్తున్న నాయకులకు సరైన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, సింగిల్విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు దోటి శ్రీనివాస్, సర్పంచ్ కారింగు పార్వతమ్మాజానయ్య, పద్మ, మారయ్య, బండమీది రాము, అదిమల్ల లింగయ్య, సులోచన శేఖర్రావు, పాలకూరి సైదులు ఉన్నారు.