తుంగతుర్తి, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ చెప్పే గ్యారెంటీ లేని వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. రైతుల నోట్ల మన్ను కొట్టే విధంగా రైతు బంధు ఆపాలన్న వారిని ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మండలంలోని వెలుగుపల్లి, సింగారంతండా గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. చేసిన అభివృద్ధిని చూసి ఆదరించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే గెలవగానే ఛత్తీస్ఘడ్, ఢిల్లీలో తిరుగుతారని, ప్రజా సమస్యలను పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని ఇన్వర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుందని చెప్పారు. రైతు బంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వారిని గ్రామాల్లో తిరుగనివ్వద్దని పిలుపునిచ్చారు. పదేండ్లుగా పండుగగా మారిన వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో మిగిలిన పనులు పూర్తి కావాలంటే మరోమారు తనను ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్రెడ్డి, సర్పంచుల ఫోరమ్ మండలాధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, గొట్టిపర్తి ఎంపీటీసీ కేతిరెడ్డి లతావిజయ్కుమార్రెడ్డి, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, వెలుగుపల్లి సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపీటీసీ మట్టపల్లి కవితాకుమార్, కేశవపురం ఎంపీటీసీ ఎలెజర్, ఉప సర్పంచ్ మోదాల పరమేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లెపాక రాములు, కేశవాపురం సర్పంచ్ మిర్యాల అనితాజనార్దన్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న, వార్డు సభ్యులు నిర్మల, ఎల్లమ్మ, వెంకటనర్సు, ఎస్.కె.యాకూబ్, యాదగిరి, గుడిపాటి వీరయ్య, జలంధర్ పాల్గొన్నారు.
అర్వపల్లి : నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కష్టాలను తీరుస్తూ సేవకుడిగా పని చేస్తున్న తనను మరోమారు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కిశోర్కుమార్ ప్రజలను కోరారు. అర్వపల్లి మండలం పర్సాయపల్లి, జాజిరెడ్డిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 30న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి మరోమారు తనను ఆశీర్వదిస్తే తుంగతుర్తిని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతాతని చెప్పారు.
ఒకప్పుడు ఏడారిగా ఉన్న నియోజక వర్గం ఇప్పుడు ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలతో సస్యశ్యామలమై పచ్చని పంట పొలాలతో భూమి మోయలేనంత ధాన్యం పండుతున్నట్లు చెప్పారు. గోదావరి జలాల ద్వారా 95 వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందన్నారు. మరింత అభివృద్ధి కోసం మరోమారు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. జాజిరెడ్డిగూడెంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ.. తుంగతుర్తిలో కిశోర్కుమార్, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతున్నట్లు చెపారు. కక్షలతో రగిలిపోయిన తుంగతుర్తి నియోజక వర్గం ఎమ్మెల్యే కిశోర్ పాలనలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నట్లు తెలిపారు.
కిశోర్మార్ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, మండల గ్రంథాలయ చైర్మన్ పి.యుగేంధర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, బొడ్డు రామలింగయ్య, ఎంపీటీసీ రాచకొండ గీత సురేశ్, గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుల భరత్రెడ్డి, హరిప్రసాద్, నాయకులు ఎర్ర నర్సయ్య, మిర్యాల వెంకన్న, మల్లయ్య, శ్రీను పాల్గొన్నారు.
తుంగతుర్తి, నవంబర్ 24 : తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 50 మంది ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బండ మహేశ్, పోలెపాక మురళి, స్వామి, లక్ష్మయ్య, భిక్షం, కొండగడుపుల ముత్తయ్య, సోమయ్య, నాగయ్యతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.