బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బోనాలు, బతుకమ్మలు, పీర్లు ఎత్తుకొని బీఆర్ఎస్ శ్రేణులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ర్యాలీగా సమ్మేళనాలకు చేరుకుంటున్నారు.
పార్టీ జెండాలు చేతబూని సీఎం కేసీఆర్ పాలనకు జేజేలు పలుకుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన సమ్మేళనంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్.. అడవిదేవులపల్లిలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి.. నిడమనూరులో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్.. కట్టంగూర్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
– కట్టంగూర్/నిడమనూరు/అడవిదేవులపల్లి, మార్చి 31