కట్టంగూర్, ఏప్రిల్ 15 : ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం రాజకీయ పార్టీగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏడాదిన్నర రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలిపారు. రజతోత్సవ సభ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభంమవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో అందరి కష్టాలు తెలుసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, నాయకులు గుర్రం సైదులు, దాసకి సంజయ్, గుండగోని రాములు, పెద్ది బాలనర్సయ్య, నకిరేకంటి నర్సింహ్మ, మునుగోటి ఉత్తరయ్య, మంగదుర్ల వెంకన్న, నోముల వెంకటేశ్వర్లు, దేవరకొండ నరేశ్, చౌగోని జనార్దన్, అంతటి శ్రీను, గుండమల్ల పురుషోత్తం, బీరెల్లి ప్రసాద్, జిల్లా యాదయ్య, జానీ పాష, బెల్లి సుధాకర్. రెడ్డిపల్లి మనోహర్, లింగస్వామి, పోతరాజు నగేశ్ పాల్గొన్నారు.
Kattangur : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య