రామన్నపేట, అక్టోబర్ 17: త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని సేవకుడిగా పనిచేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. మండలకేంద్రంలో మల్లికార్జున రైస్మిల్ నుంచి బస్టాండ్ వరకు మంగళవారం భారీ రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది అని అభివృద్ధి కావాలో అరాచకం కావాలో మీరే నిర్ణయించు కోవాలన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం అరాచకాన్ని అంతం చేయడానికే బీఆర్ఎస్ జెండాను పట్టానని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి ఒకే జెండా. ఒకే నాయకుడని కాంగ్రెస్ పార్టీకి జిల్లాకో ముగ్గురు ముఖ్యమంత్రుల అభ్యర్థుల ఉన్నారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తికి పాతరేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది అన్నారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో పేదల అభ్యున్నతికోసం ప్రకటించిన మ్యానిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. రామన్నపేటలో ఇప్పటికి రూ. 30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, బీఆర్ఎస్ మండలప్రధానకార్యదర్శి పోశబోయిన మల్లేశం, పట్టణ అధ్యక్షకార్యదర్శులు పోతరాజుసాయి, జాడ సంతోష్, సర్పంచ్లు గుత్తా నర్సిరెడ్డి, అప్పంలక్ష్మీనర్సు,మెట్టు మహేందర్రెడ్డి, ఉప్పు ప్రకాష్, కోళ్ల స్వామి, బందెల యాదయ్య, చెరుకు సోమయ్య, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, వేమవరపు సుధీర్బాబు, దోమల సతీశ్, గాదే పారిజాత,ఎండి ఆమేర్, ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు బందెల రాములు, కన్నెబోయిన అయిలయ్య, నాయకులు అంతటి రమేశ్, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశ్, రామిని రమేశ్, బొక్క పురుషోత్తంరెడ్డి, ఆవుల నరేందర్, ఆముద లక్ష్మణ్,మీర్జా ఇనాయత్ బేగ్, బొడ్డు అల్లయ్య, లవణం రాధికారాము, బడుగు రఘు పాల్గొన్నారు.
దుర్గామాతకు ఎమ్మెల్యే పూజలు
నకిరేకల్ : దేవీ శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నకిరేకల్ 20వ వార్డులో కనకదుర్గ విగ్రహం వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, నడికుడి వెంకటేశ్వర్లు, చౌగోని సైదులు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాలలోని సంతోష్నగర్లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బుస్సా శ్రీలక్ష్మిశ్రీనివాస్ దంపతుల సహకారం ఏర్పాటు చేసిన అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, నాయకులు ఖఞ పొన్నం లక్ష్మయ్య, తేరట్పల్లి హ న్మంతు, పందిరి శ్రీనివాసులు, గోధుమగడ్డ జలంధర్రెడ్డి, జమాండ్ల శ్రీనివాసరెడ్డి, పాటి మాధవరెడ్డి, సిలివేరు శేఖర్, రంగా వెంకటేశ్వర్లు, యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు గుండెబోయిన సైదులు , కడారి సత్యనారాయణ, ఎడ్ల మురళి, గిరి, నవీన్ పాల్గొన్నారు.
108 నైవేద్యాలతో నివేదన
చిట్యాల : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాన్ని సమర్పించారు.