నిడమనూరు, నవంబర్ 25: పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్తో కలిసి మండలంలోని సోమోరిగూడెం, ముప్పారం, గుం టుక గూడెం, వేంపాడు, బొక్కమంతల పహాడ్, ముకుందాపురం, ఇండ్లకోటయ్య గూడెం, తుమ్మడం, వల్లభాపు రం, వడ్డెరి గూడెం, నారమ్మ గూడెం, రేగులగడ్డ, నిడమనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల మహిళలు నృత్యాలతో తిలకం దిద్ది దారి పొడవునా ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు పాతరేనని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుందని హెచ్చరించారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని ముప్పయ్యేండ్లు పాలించిన జానారెడ్డి కనీసం గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేదని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ప్రారంభించిన వరద కాల్వను పదహారున్నరేండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలు ఆలోచించాలన్నారు.
వరద కా ల్వను దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య గెలిచిన తర్వాత వరద కాల్వ పూర్తికి చర్యలు తీసుకుని లక్ష ఎకరాలకు సాగు నీరందించారని గుర్తుచేశారు. అ న్నం పెట్టే బీఆర్ఎస్ను కాదని, కాంగ్రెస్కు ఓటేస్తే నియోజకవర్గం అధోగతి పాలవుతుందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేది తానేనని, మరో సారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఎంపీపీ జయమ్మ, నాయకులు గుర్వయ్య యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు డేవిడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యపాల్, వెంకటేశ్వర్లు, మేరెడ్డి జైపాల్ రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్, గుడిసె శంకరయ్య, అర్వ స్వాతిఅశోక్, రమేష్ యాదవ్, కేశ శంకర్, జంగిలి రాములు, నన్నెబోయిన రామలింగమ్మ, ఎంపీటీసీలు యాదయ్య, భాస్కరి నాగేంద్రనారాయణ, సంతోష్కుమార్, ముప్పారం దేవస్థాన కమిటీ ల చైర్మన్లు మేరెడ్డి వెంకటరమణ, లింగప్ప, శివ, ఉపేందర్, ఆలంపల్లి నరేష్, శ్రీనివాస్, కోటి, ప్రసాద్, మధు ఉన్నారు.
నాగార్జున సాగర్లో ఓటు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ముప్పయ్యేండ్లు ప్రాతినిథ్యం వహించిన జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు కార్యాచరణతో ఉందన్నారు. ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ను మరోమారు ఆశీర్వదించాలని కోరారు. నాగార్జున సాగర్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ గుంటనక్కల పాలు చేయవద్దని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ సూచించారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఓటేస్తే మొగుడు మోటార్లు, పెండ్లాం స్టార్టర్ల కాడ కాపలా ఉండక తప్పదని హెచ్చరించారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు కండ్ల ముందున్నాయని, మొసలి కన్నీరు కారుస్తూ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నక్కజిత్తులను చిత్తు చేయాలని ఆయన కోరారు.