నల్లగొండ సిటీ, నవంబరు 24 : నల్లగొండ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జంగమయ్యగూడెం, ఇరుగంటిపల్లి, తంగెళ్లవారిగూడెం,చిన్న మాదారం, చెట్లచెన్నారం, బాబాసాయిగూడెం, ఎస్. లింగోటం, తిమ్మన్నగూడెం, తేలకంటిగూడెం, ఇస్లాంపురం, కన్నెబాయితండా గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో సాగును పండుగలా మార్చారన్నారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదన్నారు. సీఎం కేసీఆర్అన్ని సామాజిక వర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ ణలాలను ఇంటి ఇంటికి అందిస్తున్నారని అన్నారు. మండలంలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేసింది. ఏమి లేక పోగా మరోక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని అలాంటి వారిని నమ్మి ఓటు వేస్తే అభివృద్ధి అగిపోదన్నారు. కాంగ్రెస్ నాయకులు మోసపూరిత హమీలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. కరోనా సమయంలో 4 ఏండ్లుగా కనపడని వ్యక్తులు మళ్లీ దొంగ మాటలు డబ్బు సంచులతో వస్తున్నారని వారిని తరిమి కొట్టాలన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో ఉన్న ప్రతి పనిని దగ్గర ఉండి చేస్తానన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ రోజున రైతులు ప్రజలు కరువు బారిన పడలేదన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ పలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్లా వెంటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, సర్పంచులు అమరేజి క్రాంతీశ్రీనివాస్, కన్నెబోయిన సతీశ్, ఇస్లావత్ హనుమంతరెడ్డి, కడారి రాజేశ్వరి, కన్నెబోయిన గంగమ్మాచంద్రమ్మ, ఇస్లావత్ హేయానాయక్, నామా కౌసల్య, నాయకులు నాగులవంచ వెంకటేశ్వరావు, రామగిరి శ్రీధర్రావు, జొన్నలగడ్డ శేఖర్రెడ్డి, మల్లెకంటి రాజు, అమరేజి శ్రీనివాస్, పిండి పాపారెడ్డి, బైరగోని వెంకన్నగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆజయ్ కుమార్రెడ్డి, బుర్రి శ్రీమాన్ పాల్గొన్నారు.