మిర్యాలగూడ, అక్టోబర్ 26: కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప, జాలుబాయితండా, రాయినిపాలెం, ముల్కలకాల్వ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతి యాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భాస్కర్రావుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పదేండ్లలో ఎంతో ప్రగతి సాధించామన్నారు.
ఏండ్ల తరబడి ఉన్న పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరినట్లు తెలిపారు. ఆలగడప గ్రామంలో ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.48.10 కోట్లు, జాలుబాయితండాలో రూ.8.13 కోట్లు, రాయినిపాలెంలో రూ.22.16 కోట్లు, ముల్కలకాల్వ గ్రామ పరిధిలో రూ.16.75 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మానిఫెస్టోలో ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహనుమంతరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, పీఏసీఎస్ ఛైర్మన్ రామకృష్ణ, నాయకులు మట్టపల్లి సైదులుయాదవ్, ప్రసాద్, చలికంటి యాదగిరి, మట్టపల్లి నాగలక్ష్మి, వీరవేణి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కనకదుర్గ ఆలయంలో పూజలు
మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్లో గల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీనవరాత్రుల ఉత్సవాలను కనులపండువగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పత్తిపాటి నవాబ్, కౌన్సిలర్ ఉదయ్భాస్కర్, నాయకులు కర్నె గోవిందరెడ్డి, మన్నెం లింగారెడ్డి, బల్లెం అయోధ్య, గొంగిడి సైదిరెడ్డి, అశోక్, రేపాల రమేశ్, ఎండి.ఖాదర్, వహీద్ పాల్గొన్నారు.