మిర్యాలగూడ, నవంబర్ 7: బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారం చేపట్టిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని హౌసింగ్బోర్డు, విద్యానగర్, ఈదులగూడ, రాంనగర్బంధం, ఇందిరమ్మకాలనీ, అగ్రిగోల్డ్ కాలనీ, సుభాశ్నగర్, వివేకానందనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతియాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు ముఖ్యంగా యువకులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి డప్పు వాయిద్యాలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే హౌసింగ్బోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మిర్యాలగూడలో జరిగిన అభివృద్ధిని వివరించి ఓటు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రూ.400కే వంట గ్యాస్, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన పేద మహిళలకు రూ.3వేల జీవన భృతి కల్పిస్తామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు, ఆసరా పింఛన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ.6వేలుగా దశలవారీగా పెంచుతామన్నారు. తెల్లరేషన్ కార్డుఉన్న వారందరికీ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
రూ.856.30కోట్లతో అభివృద్ధి
మిర్యాలగూడ పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రూ.856.30 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి, భవనాల నిర్మాణం, పెద్ద చెరువు సుందరీకరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. దాంతో పాటు రూ.28.43కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.511.65కోట్లతో లబ్ధిదారులకు చేయూతనిచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణాభివృద్ధిని కొనసాగేందుకు ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, జొన్నలగడ్డ రంగారెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, నాయకులు మన్నెం విజయలక్ష్మి, సాధినేని శ్రీనివాస్, పశ్యా శ్రీనివాస్రెడ్డి, దైద సోముసుందర్, మన్నెం లింగారెడ్డి, మన్నెం శ్రీనివాస్రెడ్డి, బొడ్డ నందకిశోర్యాదవ్, మెరుగు సంజయ్, ఘంటా శ్రవణ్రెడ్డి, సంతోష్రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, కూనల గోపాలకృష్ణ, ముజ్జా రామకృష్ణ, పల్నాటి జానకిరెడ్డి, కొత్త వెంకట్, నాగరాజు, కిరణ్ పాల్గొన్నారు.