చండూరు, ఆగస్టు 24 : కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న రూ.10 వేలు, రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు రూ.20 వేలు, మండల యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు రూ.10 వేలు సోమవారం నరేశ్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, వరకాల శ్రవణ్, ఎండీ సత్తార్, వర్కాల నరసింహ, వర్కాల అంబేద్కర్, చేదురవెల్లి లింగస్వామి, వరికుప్పల మహేశ్, కాశీమల్ల అనిల్, కుటుంబ సభ్యులు రేవల్లి చంద్రయ్య, రేవల్లి శ్రీను, రేవెల్లి మహేశ్ పాల్గొన్నారు.