అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజా మద్దతు లభిస్తున్నదని, వచ్చే
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరి గుట్ట మండలంలోని మైలారిగూడెం, వంగపల్లి, రామాజీపేట, చిన్నకందుకూరు, పెద్దకందుకూరు, తాళ్లగూడెం, బాహుపేట, అహ్మద్నగర్, మహబూబ్పేట, మర్రిగూడెం, చొల్లేరు గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని, సంక్షేమ పథకాలన్నీ పోతాయని ఈ సందర్భంగా ప్రజలకుసునీత వివరించారు.
యాదగిరిగుట్ట, నవంబర్ 3 : కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధుకు రాంరాం పలుకుతారని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలో ప్రచారం, రోడ్షో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మండలంలోని మైలారిగూడెం, వంగపల్లి, రామాజీపేట, చిన్నకందుకూరు, పెద్దకందుకూరు, తాళ్లగూడెం, బాహుపేట, అహ్మద్నగర్, మహబూబ్పేట, మర్రిగూడెం, చొల్లేరు గ్రామాల్లో కలియతిరిగి బీఆర్ఎస్కు మద్దతు పలుకాలని కోరారు. ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికిరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. రేవంత్రెడ్డి 3 గంటల కరెంటు సరిపోతదంటున్నాడని తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు యాదగిరిగుట్ట ప్రజలు అండగా నిలువాలని కోరారు. ఒక్కప్పుడు కరెంటు ఇవ్వక, సాగు నీళ్లురాక, పెట్టుబడి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, కాంగ్రెస్కు ఓటేస్తే తిరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు వస్తాయన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిని చూసి ఆలోచించాలన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధితోనే గుట్ట ప్రాంతంలో భూములకు రెక్కలొచ్చాయన్నారు. ఒక్కప్పుడు ఎకరానికి 10 లక్షలు దాటని భూములు, ఇప్పుడు రూ.5 కోట్లు పలుకుతుందంటే కారణం ఎవరో ఆలోచన చేయాలన్నారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
మరోసారి కేసీఆర్కు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, సర్పంచ్లు కాదూరి రజిత, తోటకూరి బీరయ్య, మొగిలిపాక తిరుమల, ఆరె స్వరూపామల్లేశ్గౌడ్, కుండె పద్మ, ఈదులకంటి భాస్కర్, ఎంపీటీసీలు రేపాక మౌనిక, ఎర్ర పోచయ్య, ఉప సర్పంచులు మారెడ్డి కొండల్రెడ్డి, రేపాక స్వామి, లక్ష్మీనారాయణగౌడ్, దేవేందర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కృష్ణస్వామి, మొగిలిపాక రాంచందర్, సీస రమేశ్గౌడ్, కట్ట మల్లేశ్గౌడ్, ఆరె శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ను మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, చిమ్ముల సుధీర్రెడ్డి, పోలగాని వెంకటేశ్ గౌడ్, గుర్రాల లక్ష్మారెడ్డి, గూదె బాలనర్సింహ, గొడుగు చంద్రమౌళి, భరత్, మహేశ్గౌడ్, శ్రీకాంత్గౌడ్, ఉపేందర్, పాపిరెడ్డి, సురేందర్రెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్
రాజాపేట : గొంగిడి సునీతామహేందర్రెడ్డి గెలుపు కోసం శుక్రవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బెడిదె వీరేశం, రజక సంఘం మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, మహేంద్ర యువసేన మండలాధ్యక్షుడు బిల్లకుదురు రాజు, సిద్ధులు, రాజు, చంద్రయ్య, మహేశ్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండల వ్యాప్తంగా ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : సునీతామహేందర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఊరూరా ప్రచారం చేశారు.
తుర్కపల్లి : మండల కేంద్రంతోపాటు ముల్కలపల్లి, మాదాపురం, వీరారెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టో పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వీనిఖిల్, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, బోరెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంతోపాటు అంబాలలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. సర్పంచ్ బాషిరెడ్డి, శ్రీనివాస్, రాంమల్లు, రమేశ్, భిక్షమయ్య, భిక్షం, ఆంజనేయులు పాల్గొన్నారు.