సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆ పార్టీ నాయకులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్.
వ్యవసాయ రంగం అభివృద్ధ్ది చెందుతుంది
అన్నదాతను ఆదుకుంటున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి అనేక పథకాలు అందిస్తున్నారు. రైతును రాజుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా అపార అనుభవం ఉన్న కేసీఆర్ దేశంలో తిరుగలేని శక్తిగా అవతరించి వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధ్ది సాధిస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ దేశమంతటా అమలుచేసే సమయం తొందరలో రాబోతున్నది.
– సురకంటి సుధాకర్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్,బ్రాహ్మణపల్లి గ్రామం (బీబీనగర్)
సీఎం కేసీఆర్పై దేశ ప్రజలకు నమ్మకం ఉంది
సీఎం కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి చేసినట్లే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని దేశ ప్రజల్లో నమ్మకం ఉంది.. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చుని దక్షిణాది రాష్ర్టాలను చిన్నచూపు చూస్తున్నారు. రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపె డుతుం టే కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరుతో దోచుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు ప్రభాత్వాన్ని ఏర్పాటు చేస్తే భారత దేశం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
-సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఎంపీపీ, నార్కట్పల్లి
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన అపర చాణిక్యుడు సీఎం కేసీఆర్. తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్థి పథంలో నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ పాలనలో దేశ వ్యవసాయ రంగంతోపాటు అనేక రంగాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లాయి. వ్యవసాయ, ఉపాధి రంగాలకు ప్రోత్సాహాం లేకుండా పోయింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొందరికే మేలు చేసేలా పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు వస్తే దేశ పురోభివృద్ధి సాధ్యమవుతున్నది. భారతదేశానికి కేసీఆర్ లాంటి వ్యక్తి జాతీయ నాయకుడు కావాలి. అప్పుడే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేందుకు వీలు ఉంటుంది. భారత బంగారు దేశంగా మార్పుచెందుతుంది.
– పాదూరి ఇంద్రసేనారెడ్డి, విశ్రాంత వార్డెన్, నల్లగొండ (నీలగిరి)
అన్నిరంగాలపై కేసీఆర్కు అవగాహన ఉంది
కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రారంభించిన బీ(టీ)ఆర్ఎస్ పార్టీతో దేశంలోని ప్రతి వ్యక్తికి న్యాయం జరుగనుంది. మన రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశం మొత్తం ఆచరణలో పెట్టగల సత్తా కేసీఆర్కు మాత్రమే ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే బీజేపీ కంటే అన్ని వర్గాలకు న్యాయం చేయగలిగే కేసీఆర్ లాంటి నాయకత్వం చాలా అవసరం. కేసీఆర్ తప్పకుండా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తాడనే నమ్మకం ఉంది. నదీ జలాలు, విద్యుత్, సేవారంగం, విద్య, వైద్యం, ప్రజల భద్రత, ఉద్యోగ కల్పన, వ్యవసాయరంగంతో పాటు అనేక అంశాలపై సీఎం కేసీఆర్ పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్రం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటే అది సీఎం కేసీఆర్ ఘనతే. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే యావత్ దేశ స్థితిగతులు మారుతాయి. భారత ప్రజలకు తప్పకుండా మేలు జరుగుతుంది.
– తొటకూరి బీరయ్య, సర్పంచ్, చొల్లేడు, యాదగిరిగుట్ట (యాదగిరిగుట్ట రూరల్)
సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి అవసరం
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా మారాయి. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు దేశానికి అవసరం. ముఖ్యంగా తెలంగాణలో సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్కు తొత్తుగా మారి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుంది. బోర్ల దగ్గర కరెంట్ మీటర్లను ఏర్పాటు చేస్తుంది. కేంద్రం వైఖరిపై సీఎం అనేకమార్లు తూర్పార పట్టారు. దేశప్రజలు, రైతులు సీఎం జాతీయ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారు.
– చింతల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ (చౌటుప్పల్)
దేశాన్ని నడిపే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది
ప్రస్తుతం దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించే సత్తా సీఎం కేసీఆర్కు ఉంది. ఆయనకు ఉన్న సుదీర్ఘ ఉన్న పాలనా అనుభవంతో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి నిలిపే సత్తా ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. నియంత్రణ లేని ధరలు, దోపిడీ పన్నుల వ్యవస్థ, హద్దులు దాటిన అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. మోదీ నిరంకుశత్వాన్ని నిలువరించే బలమైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ దశలో దేశానికి వెలుగు చూపించడం కోసం ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ అడుగులు వేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా అవతరించడం సంతోషకరం.
– వెంకటేశ్వర్రావు, హోటల్ యజమాని (నల్లగొండ సిటీ)
పేదల కష్టాలు తీరాలంటే కేసీఆర్ దేశాన్ని పాలించాలే
దేశంలోని పేద ప్రజల కష్టాలు తీరాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజల లాగా దేశంలోని ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగా ఉండాలే. దేశంలో గొప్పగా ఎదగాలే
– లావుడియా బాలూనాయక్, మొండిచింతతండా, తిరుమలగిరి
బీఆర్ఎస్ ప్రకటన శుభపరిణామం
సీఎం కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ప్రకటించడం శుభపరిణామం. బీజేపీని ప్రజలు రెండుసార్లు గెలిపించిన ఎలాంటి ఫలితం లేదు. మోదీ పాలనపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది. ప్రత్యామ్నాయ కూటమితోనే అభివృద్ధి సాధ్యమవుతున్నది. సీఎం కేసీఆర్పై పలు రాష్ర్టాల ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతుంది. దేశంలో ఎక్కాడ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎలాంటి పథకాలు కనిపించడం లేదు. దాంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టడం అవసరం ఉంది.
– సుర్కంటి శ్రీధర్రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు, మందోళ్లగూడెం, చౌటుప్పల్ రూరల్
కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లో సులువుగా రాణిస్తడు
బీ(టీ)ఆర్ఎస్ రాజకీయాల్లో దేశ చరిత్రను తిరగరాస్తుంది. రాష్ట్ర సాధన కోసం పట్టుదలతో ఉద్యమం చేసి అన్ని వర్గాలు, పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లో సులువుగా రాణిస్తాడు. దేశంలో అన్ని అవగాహన పట్టున్న కేసీఆర్ జాతీయ నాయకుడైతే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు విసిగి పోయారు. ఇదే తరుణంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల దేశం కేసీఆర్ వైపు చూస్తుది.
– డీ నారాయణరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్(దామరచర్ల)