తిరుమలగిరి(సాగర్), నవంబర్ 16: మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రం గుండ్ల గ్రామం తూటిపేటతండా, గాత్తండా, నా గార్జునపేట, జమ్మన కోట, చింతల పాలెం, నాయకునితండాల్లో భగత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో డప్పు చప్పుళ్లతో, కోలాట బృందాలతో ప్రజలు భగత్కు స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు ఎ మ్మెల్యే భగత్పై పూలవర్షం కురిపించారు.
జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2014 నుంచి 2018 వరకు ఎలా ఉంది పరిస్థితి, 2018 నుంచి 2023 వరకు పరిస్థితులు ఎలా ఉందనేది గిరిజనులు ఆ లోచించాలన్నారు. తండాలను పంచాయ తీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో తండాలు ప్రగతిబాట పట్టాయని అన్నారు. రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ను మూడో సారి ముఖ్యమంత్రిగా చేస్తే రైతుబంధు ఎకరాకు రూ.16 వేలను అందించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెసోళ్ల మాయమాటల నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. రైతులకు 3గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ కావాల్నా.. 24గంటల ఉచిత కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. ప్రజలే నిర్ణయిం చా లన్నారు. బీఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రజలే బాస్లు అని చెప్పారు. కాంగ్రెసోళ్లకు ఢిల్లీ గులాములు బాస్లని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏంకావాలో ఉద్యమ, ప్రజా నా యకుడు సీఎం కేసీఆర్కు తెలుసు అని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గిరిజనులకు లబ్ధి చేకూరిందని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. గతంలో గిరిజనులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. తిరుమలగిరి మండలంలో 20మందికి పైగా గిరిజన సర్పంచ్లు ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. హాలియా పట్టణంలో ఎకరం భూమిలో సుమారు రూ.3కోట్లతో గిరిజన భవనం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆం గోతు భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్యభాష్యనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావునాయక్, ఏఐబీఎస్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు భిక్షానాయక్, మండల అధ్యక్షుడు పిడి గం నాగయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్రెడ్డి, నాయకులు అల్లి పెద్దిరాజు, తిరుమల్, నాసర్రెడ్డి, బాసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రమణరాజు, బాలాజీ నాయక్, కోట్యానాయక్, బాబురావు, భాష్యా, నందా, శ్రీను, రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.