ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కలిపామని, నియోజకవర్గంలో మొదటిసారిగా గుండాలకే కాళేశ్వరం నీళ్లు వచ్చాయని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గుండాల మండలంలోని పలు గ్రామాల్లో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతామని, కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే రైతులకు కరెంట్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.
గుండాల, నవంబర్ 22 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం కటిక చీకట్లోకి వెళ్తుందని, మోసపోతే గోస పడుతామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, రామారం, నూనెగూడెం, గం గాపురం, మరిపడిగ, మాసాన్పల్లి, సీతారాంపురం, వె ల్మజాల, కొ మ్మాయిపల్లి, బురుజుబావిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రజలు వారిని నమ్మి ఓటేస్తే రైతులకు కరెంటు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రిభువనగిరి జిల్లాలో కలిపామన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మండలానికి దేవాదుల కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోనే మొదటగా సాగు జలాలు గుండాల మండలానికి అందాయని గుర్తు చేశారు. డిసెంబర్ 3 తర్వాత ప్రజలకు రేషన్ షాపుల ద్వార సన్నబియ్యం, తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ ఖలీల్, సెక్రటరీ జనరల్ సంగి వేణుగోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు ఎంఏ రహీం, జిల్లా నాయకులు గార్లపాటి సోమిరెడ్డి, గడ్డమీది పాండరి, కోలుకొండ రాములు, పబ్బూరి సుధాకర్, దుడుక ఉప్పలయ్య, బాల్రెడ్డి, సర్పంచులు గూడ ఉపేంద్రరవీందర్, బండారు సంధ్యాశ్రీనివాస్, గాయత్రి, రమేశ్, దార సైదులు, దుంపల శ్రీనివాస్, మలిపెద్ది మాధవి, సంగి బాలకృష్ణ, విజితారెడ్డి, రాధిక, అబ్బులు, ఎంపీటీసీలు బొంగు శ్రీశైలం, కవిత, సుశీల, నాయకులు మెగులాల్, చిన్నపరెడ్డి, మమత, చెన్నారెడ్డి, అన్వర్, రంగారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, రమేశ్, కాశయ్య, లింగస్వామి, కూనగళ్ల గణేశ్, పాండు, ప్రమోద్, యువజన విభాగం నాయకులు రంజిత్రెడ్డి, మహోదయ్, మధు, కొమ్మగళ్ల దయాకర్, వంగూరి అనిల్, కారుపోతుల సాయి, కందుకూరి చందు పాల్గొన్నారు.