తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని, కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని
తెలిపారు.
బొమ్మలరామారం, నవంబర్ 11 : రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఫక్కీర్గూడ, మేడిపల్లి, మైలారం, తిరుమలగిరి, ఖాజీపేట, యావాపూర్, బండకాడపల్లి, గద్దరాళ్లతండా, కంచల్తండా, గోవింద్తండా, రామస్వామితండాలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలేరుకు కాళేశ్వరం జలాలు తెచ్చి తాగు, సాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని, రైతులకు కరెంట్ కష్టాలు తొలగించిన బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. దళిత బంధును దళితులందరికి వర్తింపజేస్తామన్నారు. రేషన్కార్డుదారులందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించడం సీఎం కేసీర్ తీసుకొన్న గొప్ప నిర్ణయమని అభివర్ణించారు. అన్ని వర్గాలకు నిరంతరం అందుబాటులో ఉంటు సేవలు అందిస్తున్నందున తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్మల సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్, మండల సెక్రటరీ జనరల్ గుర్రాల లక్ష్మారెడ్డి, మండల నాయకులు గూదె బాలనర్సింహ, మేడబోయిన గణేశ్, వడ్లకొండ ఆనంద్, అశోక్నాయక్, శ్రీనునాయక్, రాజన్ నాయక్, ఈశ్వర్గౌడ్, బీరప్ప, భరత్, మహేశ్ గౌడ్, శ్రీధర్, సతీశ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.