కోదాడ, మార్చి 31 : అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు, ఐక్యత, సోదర భావం పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రార్ధనలు నిర్వహించి మాట్లాడారు. రంజాన్ మాసంలో ఆచరించిన ఉపవాస దీక్షల స్ఫూర్తితో అందరూ తమ జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలన్నారు. దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం రంజాన్ మాసం అని, రంజాన్ మాస దీవెనలు ప్రజలందరికీ కలగాలన్నారు.
ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలో ఉన్న ముస్లింలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం తదితర రాజకీయ పక్షాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మహబూబ్ జానీ, ఎర్నేని బాబు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు షేక్ నయీమ్, బొలిశెట్టి కృష్ణయ్య, ముత్యాలు పాల్గొన్నారు.
Kodada : సమాజంలో సోదరభావం పెంపొందాలి : అబ్దుల్ ఖాదీర్