నివారణకు 18 నుంచి ఉచితంగా టీకాలు
పది రోజులపాటు పశుసంవర్ధక శాఖ కార్యాచరణ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 145 బృందాలు
అధిక వర్షాల నేపథ్యంలో వ్యాపించే అవకాశం
నల్లగొండ /మిర్యాలగూడ రూరల్, జూలై 14 : వర్షాకాలంలో జీవాలకు నీలి నాలుక (బ్లూ టంగ్) లేదా మూతి వాపు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. దాంతో ఈ నెల 18 నుంచి టీకాలు వేసేందుకు పశుసంవర్ధ్దక శాఖ చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం సాధారణానికి మించి వర్షాలు పడుతుండడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధి ప్రబలకుండా వెంటనే గ్రామాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కార్ సూచించచడంతో అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 145 బృందాలను ఏర్పాటు చేసింది. అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి టీకాలు వేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 లక్షల జీవాలు ఉండగా అందులో కొదమలు 8.50 లక్షల ఉన్నట్లు పశు సంవర్ధ్దక శాఖ యంత్రాంగం గుర్తించింది. వీటన్నింటికీ ఈ డ్రైవ్లో టీకాలు వేయనున్నారు.
ప్రథమ చికిత్స..
లక్షణాలు ఇవే…
వ్యాధి సోకేది ఇలా..
మూతి వాపు వ్యాధి గొర్రెలకు దోమకాటు వల్ల సోకుతున్నది. సాధారణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్లో ఈ వ్యాధి ఎక్కువగా మందలో 30 నుంచి 50 శాతం గొర్లకు సోకే అవకాశం ఉంటుంది. అందులో 10 శాతం మేరకు మృత్యువాత పడతాయి. ఈ సారి జూలైలోనే ఊహించని రీతిలో వర్షాలు పడుతుండడంతో గొర్రెలు జబ్బు బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 18 నుంచి టీకాలు వేయాలని పశు సంర్ధకశాఖను ఆదేశించింది.
నివారణ చర్యలు..
ప్రతి కొదమకు టీకా వేయించాలి
వర్షాకాలంలో కొదమలకు మూతి వాపు (బ్లూ టంగ్) వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున యాజమాన్యం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి కొదమకు టీకా వేయించాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి ఈ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాలి. నల్లగొండలో 73 బృందా లతో ఈ టీకా కార్యక్రమం చేపడుతున్నాం.
– శ్రీనివాస్ రావు, పశు సంవర్ధ్దక శాఖ అధికారి, నల్లగొండ