బీబీనగర్, డిసెంబర్ 1 : మండల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన వారు గతంలో ఉన్న నాయకుల ఆత్మీయ కలయిక కోసం గురువారం పీఆర్జీ గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంపై ఇటీవల పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డికి ముందస్తు సమాచారం ఉన్నది. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి హాజరవుతాడనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనానికి వీరిరువురు గైర్వాజరయ్యారు.
అంతేకాకుండా అనుచర వర్గాన్ని సైతం హాజరు కావొద్దని ఆదేశాలు జారీ చేయడంతో వారు సైతం ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కాలేదు. ఇటీవల భువనగిరి కేంద్రంలోని ఓ హోటల్లో జరిగిన రెండు కీలక సమావేశాలకు, ఆత్మీయ సమ్మేళనానికి ఇరువురు నేతలు గైర్హాజరు కావడంతో కమలంలో వర్గ పోరు బహిర్గతమైంది. పీవీ శ్యామ్సుందర్రావు సొంత గ్రామం బీబీనగర్ కాగా, గూడూరు నారాయణరెడ్డి గ్రామం మండలంలోని గూడూరు కావడంతో కావాలనే జిట్టా బాలకృష్ణారెడ్డి హాజరవుతుండని ఈ సమాశానికి గైర్హాజరయ్యారని స్పష్టంగా తెలుస్తున్నది. అంటే నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కమలం పార్టీ మూడు వర్గాలుగా విడిపోయిందని ఆత్మీయ సమ్మేళనంలో మరోమారు బహిర్గతమైంది.