నార్కట్పల్లి, మార్చి 20 : దుర్మార్గపు పనులకు కేరాఫ్గా ప్రధాని మోదీ ప్రభుత్వం అని యువతను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో క్యాంప్ కార్యాలయంలో సోమ వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురై తాను అన్న మాటలు అన్యదా భావించద్దని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గం వ్యాప్తంగా మహిళలను సన్మానించి గౌరవించే సంస్కృతి తనదని అన్నారు. చదువులు ఉద్యోగాలు వద్దు యుద్ధం చేద్దాం అంటూ బీజీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే నీచుడు బండి సంజయ్అని అన్నారు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రశ్న పత్రాలు లీకైనా కూడా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ సంక్షేమ పథకాన్ని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటూ వేధిస్తుందని అన్నారు.
బీజేపీ పాలనలో పేదలకు మొండి చెయ్యి, మాట వినని నాయకులపై ఈ డీ, ఐటీ దాడులు నిర్వహిస్తుందన్నారు. నల్లధనాన్ని వెలికితీస్తానని నోట్లు రద్దు చేసిన మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనలేకనే బీజేపీ నాయకులు చిల్లర చేష్టలు చేస్తాన్నారని, దేశంలో సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే అని పేర్కొన్నారు. తక్కువ కాల ంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేష్టలను చూసి ప్రజలు నవ్వుకు ంటున్నారని, బీజీపీతో రేవంత్రెడ్డి చీకటి ఒప్పందాలు ఎప్పుడో బయట పడ్డాయన్నారు. తలాతోక లేని వాదనలతో భట్టి విక్రమార్క తన స్థాయిని తగ్గించుకుంటున్నారని తెలిపారు. చిన్ననారాయణపురం సర్పంచ్ కొత్త నర్సింహ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విష్ణుమూర్తి, నాయకులు దుబ్బాక శ్రీధర్, వెంకట్ పాల్గొన్నారు.