నల్లగొండ : నల్లగొండ జిల్లాలో పండుగ పూట విషాద ఘటన జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నవ వధువు భర్తను కోల్పోయింది. తీవ్రంగా గాయపడి తాను కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. వివరాలివి.. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మంజుల శివ(23)కు కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన లైలా అనే యువతికి రెండునెలల క్రితం వివాహమైంది. ఇవాళ రక్షాబంధన్ కావడంతో సోదరుడికి రాఖీ కట్టేందుకు లైలా భర్త శివతో కలిసి బైక్పై పుట్టింటికి బయల్దేరింది. తిప్పర్తి మండలం ఇండ్లూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్, దంపతులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో శివ మృతిచెందాడు. లైలా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.