నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగ బోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కండువాలు, జెండాలు పక్కన పడ్డాయి ఇన్నాళ్లు రణగొణ.
నల్లగొండ, నవంబర్ 28 : నల్లగొండ గడ్డ.. గులాబీ అడ్డా అని ఎన్ని కుట్రలు పన్నిన నల్లగొండ గడ్డపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది.
దాదాపుగా 10వేలకు పైగా బైకులతో పుర వీధుల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మరోసారి కంచర్ల గెలిస్తేనే అభివృద్ధ్ది కొనసాగుతుందని లేదంటే జరిగే అభివృద్ధి ఆగిపోతుందని నినదించారు. హైదరాబాద్ రోడ్డులోని మర్రిగూడ బైపాస్ సమీపంలోని లక్ష్మి గార్డెన్స్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ క్లాక్ టవర్ వరకు సాగింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో నియోజక వర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో ఓడిపోయి హైదరాబాద్కు వెళ్లిన వ్యక్తి ఈ ఎన్నికలల్లో డబ్బు సంచులతో వచ్చి నాయకులను కొనుగోలు చేసి హడావిడి చేస్తున్నాడని, ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసమే ఉన్నానని, తన బలం, బలగం ప్రజలేనని అన్నారు.
నాలుగున్నరేండ్లలో నియోజకవర్గానికి ఎంత చేయాలో అంత చేశానని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉందని, కార్యకర్తలు అందరూ ప్రతి ఓటరు వద్దకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసేలా కృషి చేయాలని కోరారు. 2014లో కుట్రలు కుతంత్రాలతో ఆటో గుర్తును తీసుకువచ్చి తనను ఓడించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈసారి కూడా గుర్తును పోలిన రెండు గుర్తులను తీసుకువచ్చి కుట్రలు కుతంత్రాలకు తెర లేపాడని విమర్శించారు. ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ నల్లగొండలో నిర్వహించిన ఈ ర్యాలీని చూస్తే భూపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని ఇక మెజార్టీయే మన ముందు ఉన్న లక్ష్యమని అన్నారు.
గత ఎన్నికల్లో సీఎం ఇచ్చిన మాట ప్రకారం నల్లగొండలోరూ. 1,400 కోట్లతో అభివృద్ధి పులు చేపట్టామని మరోసారి భూపాల్రెడ్డికి అవకాశమిస్తే ఈ నల్లగొండ రూపు రేఖలే మారుతాయని అన్నారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియొద్దిన్ మాట్లాడుతూ నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి ఓటేసే గెలిపిస్తేనే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది కొనసాగుతుందని లేదంటే ఆగిపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, ఆలకుంట్ల మోహన్ బాబు, మారగోని గణేశ్, సుంకరి మల్లేశ్ గౌడ్, కనగల్ ఎంపీపీ కరీంపాషా, రావుల శ్రీనివాస రెడ్డి, యాట జయప్రదారెడ్డి, దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, కొండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ పాల్గొన్నారు.