భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ చౌరస్తా కర్బలా మైదానం నుంచి జామా మసీద్ దర్గా కమాన్ వరకు, సమ్మద్ చౌరస్తా నుంచి భాజిమొహల్లా, జంఖాన్గూడెం మీదుగా దర్గాకమాన్ వద్ద షహజాదే ఖాసీం పీర్లచావడి వరకు మాతం నిర్వహించారు.
ఈ సందర్భంగా యువకులు బ్లేడ్లు, చిన్నచిన్న చాకులతో చాతిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మహ్మద్ ప్రవక్త మను మడు ఇమాం హుసేన్ వీర మరణాన్ని స్మరిస్త్తూ మాతం ప్రదర్శన నిర్వహించినట్లు సంఘం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ రజాక్ హుసేన్. తెలిపారు. ఈ ప్రదర్శనలో సయ్యద్ కల్బేహేసేన్, మహ్మద్లాయిఖ్ అలీ, సయ్యద్ తఖీ హుసేన్, రషీద్ అలీ, అస్గర్ అహ్మద్, ఇమ్రాన్, అద్నాస్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు.