నల్లగొండ ప్రతినిధి, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల స్థాయిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 187 మంది పోలీస్ సిబ్బందికి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్రెడ్డి ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్లో పనిని 17 విభాగాలుగా విభజించి వాటి ప్రాతిపదికన ఈ అవార్డులను అందజేసినట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లా నుంచి అవార్డులు పొందినవారిలో నార్కట్పల్లి సీఐ శివరాంరెడ్డి, చండూర్ ఎస్ఐ నవీన్కుమార్, కానిస్టేబుళ్లు జె.రమేశ్(నల్లగొండ ట్రాఫిక్), ఎం.శ్రీను(నల్లగొండ రూరల్), వెంకటేశ్వర్రెడ్డి(నల్లగొండ మహిళా పోలీస్స్టేషన్), సైదానాయక్(నిడమనూరు), ఆర్.రమేశ్(నల్లగొండ రూరల్), అడెమ్మ(మిర్యాలగూడ టుటౌన్, హోంగార్డు ఏడుకొండల్(గుడిపల్లి పీఎస్)ఉన్నారు.కార్యక్రమంలో అడిషనల్ డీజీలు గోవింద్సింగ్, రాజీవ్త్రన్, జితేందర్, స్వాతిలక్రా, నాగిరెడ్డి, సంజయ్జైన్, విజయ్కుమార ఐజీ కమలహాసన్రెడ్డి, ఇతర సీనినయర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.