కట్టంగూర్, జూలై 18 : కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చుట్టారు. కుల వృత్తులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ను అందజేయడంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుని కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్ సెలూన్లు, రజకులు నిర్వహిస్తున్న లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల కరెంట్ను ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని రెండేండ్లుగా అమలు చేస్తున్నది
. ఈ షాపులకు విద్యుత్ ప్రధాన అవసరంగా కాగా ప్రతినెలా ఎక్కువ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చేది. ఒక్కో దుకాణానికి రూ 500 నుంచి రూ.1000 వరకు వచ్చేది. దాంతో వారు ప్రతినెలా కరెంటు బిల్లులు చెల్లించేందుకు యజమానులకు పెనుభారంగా మారేది. వారికి ప్రభుత్వం కల్పించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఊరట నిస్తున్నది. ఆయా వృత్తుల వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో ఉచిత విద్యుత్ పథకం సత్పలితాలిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తింపు పొందిన ఈ కులవృత్తిదారులు ఈ పథకంతో ఎంతో లభ్ధి పొందుతున్నాయి.నియోజవర్గం వ్యాప్తంగా 259 సెలూన్లు, 859 లాండ్రీలకు మొత్తం 1,118 దుకాణాలు ప్రస్తుతం ఉచిత కరెంట్ అందుతుంది.
నకిరేకల్లో..170 లాండ్రీలు, 69 సెలూన్లు
కట్టంగూర్లో..95 లాండ్రీలు, 22 సెలూన్లు
కేతేపల్లిలో..74 లాండ్రీలు, 28 సెలూన్లు
నార్కట్పల్లిలో..115 లాండ్రీలు, 54 సెలూన్లు
చిట్యాలలో.. 254 లాండ్రీలు, 49 సెలూన్లు
రామన్నపేటలో..171లాండ్రీలు ,37 సెలూన్లు
నెలకు రూ.2 వేలు ఆదా ఆవుతున్నది
40 యేండ్లుగా నకిరేకల్ పట్టణంలో ఇస్త్రీ షాపు నడుపుతున్నా. గతంలో బొగ్గులకు రూ.2వేల నుంచి 3 వేల వరకు ఖర్చు చేసే వాళ్లం. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత కరంటుతో నెలకు రూ.2వేల ఖర్చు ఆదా ఆవుతుంది. కరంటు ఐరన్ బాక్సుతో తొందరగా బట్టలను ఇస్త్రీ చేస్తున్నాం. మా రజకులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. నకిరేకల్ పట్టణంలో దోబీఘాట్ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు.
– దుప్పలపల్లి సైదులు ఇస్త్రీ షాపు యజమాని నకిరేకల్
సీఎం కేసీఆర్ది గొప్ప మనస్సు
సమాజంలో వెనుకబడిన కుల వృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో ఉచిత కరంట్ పథకం అమలు చేస్తుం డు. గతంలో మా దుకాణంలో విద్యుత్ మీటర్లు సెకండ్ కేటగిరి ఉండడంతో ప్రతినెలా రూ. వెయ్యి రావడంతో బిల్లు చెల్లించేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ఉచిత కరెంట్తో డబ్బులు ఆదా చేస్తున్నంమా లాంటి కుల వృత్తిదారులకు ఈ పథకం గొప్ప వరం లాంటిది. ఈ పథకం అమలుతో మాలాంటి వారికి ఆత్మ విశ్వాసం పెరిగింది. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– ప్రజ్ఞాపురం శ్రీనివాస్,సెలూన్ షాపు, యజమాని నార్కట్పల్లి
రజకుల కష్టాలు గట్టెక్కించిన సీఎం కేసీఆర్
ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా రజక వృత్తిదారులను ఆదుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత కరంట్తో లాభం చేకూరింది. రజకుల కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రజకులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటారు.
– రెడ్డిపల్లి మనోహర్, రజక సంఘం నాయకుడు