నాగారం, మార్చి 27 : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ సమీపంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. అనంతరం తాసీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఇండ్లు మంజూరై చాలా రోజులు గడుస్తున్నా పట్టాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపికైన 75మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. త్వరగా ఇవ్వకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు దేవరకొండ వెంకన్న, దోమలపల్లి గోవర్ధన్, పడిశాల వెంకటేశ్, మహేశ్, ఎల్లయ్య, నర్సయ్య, రజిత పాల్గొన్నారు.