యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది.
యాదాద్రి, అక్టోబర్ 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో ఆదివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొండపైన ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా బతుకమ్మను పేర్చి ఆటలాడారు. ఆలయ ఈఓ ఎన్.గీత, మహిళా అధికారులు ఆడిపాడి ఆనందంగా గడిపారు. చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే దక్కిందని ఆలయ ఈఓ గీత అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు సద్దుల బతుకమ్మ ఆడారు.