కేతేపల్లి, నవంబర్ 4 : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో శనివారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయమని ఓటర్లను వారు కోరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గాన్ని అలజడులు సృష్టించేందుకు ప్రత్యర్థ్ధి పార్టీల వారు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని పట్టించుకోకుండా మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కోరారు. సందర్భంగా ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నిరంతర విద్యుత్, రైతుబంధు లాంటి పథకాలతో రాష్ర్టాల్లో నేడు వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు.
ఎన్నికలప్పుడు మాత్రమే కనపడే పార్టీలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, కేతేపల్లి-2 ఎంపీటీసీ దాచేపల్లి నర్మదా నాగేశ్వర్రావు, ఎస్.వెంకట్రెడ్డి, ఏర్పుల సౌడయ్యయాదవ్, ఎన్.నాగేశ్వర్రావు, కోట పూర్ణ చందర్రావు, సంపత్, నర్సయ్య పాల్గొన్నారు .
కట్టంగూర్ : పని చేసే వారిని ప్రజలు ఆదిరించి అక్కున చేర్చుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పిట్టంపల్లి, భాస్కర్లబాయి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా అన్యాయానికి గురయ్యారని, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు నమ్మి కాంగ్రెస్ అధికారమిస్తే ఆధోగతి పాలు చేసిందన్నారు.
కనీసం 5గంటల కరెంట్ ఇవ్వలేక చేతులెత్తేసిందన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మీకు సేవకుడిగా ఉంటానన్నారు. కార్యక్రమంలో గొర్రెలు , మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్న దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊ ట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్ పనస సైదులు, చినపాక పరశురాములు, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు జానీ పాషా. ఉప సర్పంచులు కత్తుల జ్యోతీదేవేందర్, గుండమల్ల సుమలతారామస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు చీర రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్డె సైదిరెడ్డి, నాయకులు గుండమల్ల పురుషోత్తం, పల్నాటి నరేందర్, గాదపాక కన్నయ్య పాల్గొన్నారు.