తుంగతుర్తి, జూలై 06 : స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంట్కు ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని, దేశ అభివృద్ధికి, దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నేటితరం యువత జగ్జీవన్ రాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, తునికి సాయిలు, తడకమళ్ల రవికుమార్, చింతకుంట్ల మనోజ్, మట్టిపెల్లి వెంకట్, సాయి కిరణ్, వెంకటేష్, మధు పాల్గొన్నారు.