మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. లాక్డౌన్ కారణంగా నెలరోజుల నుంచి స్వగ్రామంలో ఉన్న ఉమ సోమవారమే తిరిగి హైదరాబాద్కు వెళ్లిందని తల్లిదండ్రులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం యువతి మృతదేహాన్ని ముకుందాపురానికి తీసుకువచ్చారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.