మోత్కూరు, అగస్టు 24 : మున్సిపాలిటీ కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని సేక్రెడ్ హర్ట్ ఉన్నత పాఠశాల సమీపంలో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లికి చెందిన పల్లె భగత్(22), గుండాల మండలం సుద్దాలకు చెందిన వై నిరంజన్(22) ఇద్దరూ నంబర్ లేని బైక్పై మోత్కూరు వస్తుండగా అనుమానంతో వారిని ఆపారు.
దాంతో యువకులు బైక్ను వదిలి పారిపోతుండగా పట్టుకొని తనిఖీ చేశారు. బైక్ ట్యాంక్ కవరులో 520 గ్రాముల గంజాయి లభించగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా వారితోపాటు ఉప్పల్కు చెందిన బొంపెల్లి సతీశ్, అవినాశ్ అలియాస్ డ్యానీ, మరో మైనర్ కలిసి కొంతకాలంగా గంజాయి దందా నిర్వహిస్తూ ఈ ప్రాంతానికి చేరవేస్తున్నారని చెప్పారు. నిందితుల వద్ద మూడు సెల్ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.