– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
కొండామల్లేపల్లి, ఏప్రిల్ 10 : విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొండమల్లేపల్లి పట్టణంలో కరెంట్ డీఈ కార్యాలయం వద్ద నిర్వహించిన విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడుతూ విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. 2026 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.

‘ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి’